0 4 weeks

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 2 అక్టోబర్:: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలో గల బాగారెడ్డి స్టేడియంలో అక్టోబర్ 10వ తేదీ రోజున ప్రారంభం అయ్యే జెడ్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ కు సలహాదారులుగా జహీరాబాద్ పట్టణ మాజీ కౌన్సిలర్లు, మహమ్మద్ జాంగిర్, పి రాములు, మూతిరామ్, మహమ్మద్ యూనుస్, ను జహీరాబాద్ జెడ్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహక అధ్యక్షుడు మొహమ్మద్ నయముద్దీన్ బుధవారం వారికి సన్మానించి నియామక పత్రం అందించారు ఈ సందర్భంగా జహీరాబాద్ లో పది సంవత్సరాల నుండి జడ్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ టోర్నమెంట్ కి క్రీడాకారులు పెద్ద ఎత్తున పోటీపడి ఆడడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు 10 సంవత్సరాలనుండి జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల యొక్క సహకారాలతో పది సంవత్సరాలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో పెద్ద ఎత్తున జహీరాబాద్ లో జడ్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలి అని ఉద్దేశంతో పదో తారీకు రోజు ప్రారంభించాలని జహీరాబాద్ మాజీ కౌన్సిలర్లకు , జెడ్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ సలహాదారులుగా నియామక పత్రాలు అందించడం వారు గతంలో కూడా జెడ్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి ఎన్నో సహకారాలు చేసిన వారు వాళ్లకు అనేక అనుభవంతో ఈ నియామకం చేపట్టడం జరిగింది కాబట్టి అక్టోబర్ పదో తేదీ రోజు ప్రారంభమయ్యే జెడ్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ కు పెద్ద ఎత్తున క్రీడాకారులు రావాలని కోరడం జరిగింది అలాగే స్థానిక వాళ్లు కూడా సహకరించాలని వారు పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు