0 1 min 6 mths

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 11 మే 2024 :: ఎంపీ ఎలక్షన్స్ ప్రచారం లో భాగంగా సౌమ్యుడైనా జహీరాబాద్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ప్రభుత్వం గురుంచి మరియు మోడీ గారి గురుంచి విమర్శించి ఒక మీడియా గ్రూప్ లో పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ప్రభుత్వం గానీ మోడీ గానీ రామ్ మందిర్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని. నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే అయ్యాను అని జహీరాబాద్ నడిబొడ్డున ఒప్పుకుంటారా అని జ్యోతి పండాల్ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందు మీరు ఎమ్మెల్యే అవ్వడానికి మీ బీ ఆర్ ఎస్ లీడర్స్ ఫాం హౌస్లలో ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడారో అంత తనకు తెలుసు అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వడానికి కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ఉ0టారు అలాంటిది 500 సంవత్సరాల నుండి ఉన్న సమస్యని సామరస్యంగా పరిష్కరించి రామ మందిరాన్ని కట్టిస్తే బీజేపీ కట్టలేదు మోడీ కట్టలేదు అని అంటారా. అందరు అనుకుంటున్నట్టు మోడీ గారి హయం లో ఒక్క రామ మందిరమే కాకుండా మన భారత దేశం లోనే అతి పెద్ద మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అనే మస్జిదు మైనారిటీల కోసం అదే అయోధ్యలో నిర్మాణం జరగటం చాలా సంతోషించాల్సిన విషయం. మోదీ గారు ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించడం వల్ల అయోధ్యలో రామ మందిరం ఏ కాకుండా మన దేశంలో లోనే అతి పెద్ద అయోధ్య మస్జిద్ నిర్మాణం మోడీ గారి హయం లో జరగడం చాలా సంతోష కరమైన విషయం. ఆ మస్జిద్ కి కేటాయించిన స్థలం లోనే మస్జిద్ తో పాటు కమ్యూనిటీ కిచెన్, లైబ్రెరీ, హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ కూడా ఉండటం చాలా చాలా హర్షణీయం. 500 సంవత్సరాల నుండి ఏ పార్టీ గానీ ఏ లీడర్ కూడా తీర్చని సమస్యని తీర్చి హిందూ ముస్లిoలను రెండు మతాల వారిని కూడా సంతోష పరిచిన ఘనత మోడీ గారికే చెందుతుంది. ఎవరు పడితే వారి వల్ల ఇది సాధ్యం కాదు సాక్షాత్తు దైవానుగ్రహం ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని జ్యోతి పండాల్ అన్నారు. మోదీ గారు 11 రోజులు నిష్ఠగా ఉపవాస దీక్ష తో ప్రాణప్రతిష్ఠ చేసి రామ మందిరం గురుంచి కష్టపడితే మోడీ గారి గురుంచి విమర్శిస్తున్నారు అంటే మీకు మీ పార్టీ వాళ్ళకి ఎంత సంస్కారం ఉందో తెలుస్తుంది అని జ్యోతి పండాల్ మండి పడ్డారు. మీ కేసీఆర్ లాగా ఫాం హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేసే వ్యక్తి కాదు మోదీ. రామ మందిర నిర్మాణమoటే నాలుగు కట్టే పుల్లలు రెండు రేకులు అని అనుకున్నావా అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. ఐతే మీరు మీ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం మరియు బీ ఆర్ ఎస్ నీ ఏలిన కల్వకుంట్ల కుటుంభానికి చెందిన ఆ నలుగురే కట్టించి వుంటారు మరి ఎందుకంటే మా మోడీ ఎం చేసిన కూడా మీరే చేసినట్లు ప్రచారం చేసుకుంటారు కదా. 33 శాతం మహిళల రిజర్వేషన్ మా గవర్నమెంట్ చేస్తే మీ అక్క ఢిల్లీల పోయి ధర్నా చేయడం వల్ల వచ్చింది అని అంటారు, రేషన్ బియ్యం మా గవర్నమెంట్ ఇస్తే మేమే ఇస్తున్నాము అని, రైల్వే స్టేషన్ కి నిధులు వస్తే మేము చెప్తేనే మోడీ ఇచ్చారు అని ఇలా వేరే గవర్నమెంట్ వాలు ఇల్లు అలికి పెడితే మీరు పండగ చేసుకోవడము మీకు అలవాటే కదా అని జ్యోతి పండాల్ ఎద్దేవ చేశారు.